తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2020, 9:24 AM IST

Updated : Jul 17, 2020, 9:32 AM IST

ETV Bharat / bharat

దేశంలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,956 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరో 687 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

india reaches 10 lakh corona cases
భారత్​లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,956 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీనితో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరో 687 మంది కరోనా బారిన పడి మరణించారు.

భారత్​లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
  • మహారాష్ట్రలో కరోనా​ మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,84,281కి చేరింది. 11,194 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,56,369కి చేరాయి. 2,236 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,18,645గా ఉంది. మొత్తంగా 3,545 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 45,481 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణయింది. 2,089 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Last Updated : Jul 17, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details