తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

కర్తార్​పుర్​ నడవాపై చర్చించేందుకు పాక్​ అధికారులతో అఠారీ-వాఘా సరిహద్దులో మరోసారి సమావేశం అయ్యారు భారత అధికారులు​. భద్రతా పరమైన అంశాలతో పాటు యాత్రికుల సంఖ్యకు సంబంధించి నిర్ణయానికి వస్తారని సమాచారం.

By

Published : Jul 14, 2019, 9:44 AM IST

కర్తార్​పుర్​

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశమయ్యారు. అఠారీ-వాఘా సరిహద్దులో ఈ భేటీ జరుగుతోంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.

ఎక్కువ భాగం పాక్​లోనే..

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్​ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్​కు సూచిస్తోంది భారత్​.

అక్టోబర్​ 31కి పూర్తి

గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019 నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించాలని భావిస్తోంది భారత్​. దారి పొడవునా పటిష్ఠ భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

ABOUT THE AUTHOR

...view details