తెలంగాణ

telangana

భారత్​లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!

By

Published : Apr 24, 2020, 3:06 PM IST

ఎండాకాలంలో కరోనాను వ్యాప్తి తగ్గుతుందని ఊపిరి పీల్చుకొనే సమయంలోనే కొందరు పరిశోధకులు మరో బాంబు​ పేల్చారు. వర్షాకాలంలో కరోనా రెండో దశ వ్యాప్తి తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

India may see second wave of COVID-19 outbreak in monsoon, say scientists
వర్షాకాలంలో కరోనా మీ ఇంటి తలుపుతట్టొచ్చు!

భారత్​లో కొవిడ్​-19 కేసులు ఎక్కువవుతుంటే.. తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో విషయం కలవరపెడుతోంది. లాక్​డౌన్​ వల్ల కేసుల విజృంభణ తగ్గినా.. వర్షాకాలంలో రెండో దశ కేసులు నమోదవుతాయని చెప్పారు. జులై లేదా ఆగస్టులో ఈ పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వాలను హెచ్చరించారు.

కచ్చితంగా పాటించాల్సిందే..

ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించడంపైనే... వైరస్​ వ్యాప్తి, కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు శివ నాడార్​ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తే.. మళ్లీ వైరస్​ వ్యాప్తి పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం చైనాలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని ఉదహరించారు.

కోలుకున్నవారికి మరింత ముప్పు!

తొలిదశ కరోనా వచ్చి కోలుకున్నవారికి రెండో దశ వైరస్​ వ్యాప్తి చెందితే.. ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు పరిశోధకులు. ప్రస్తుతం చైనా, ఐరోపా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. బాధితుల్లో తగినంత వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే ఇందుకు కారణమని వివరించారు.

ఐసోలేషన్​, హోమ్​ క్వారంటైన్​, సామాజిక దూరం, మాస్కులు ధరించడం వల్ల భారత్​ వైరస్​ నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు పరిశోధకులు.

లాక్​డౌన్​ సమయంలోనే టెస్టులు, ట్రేసింగ్​, క్వారంటైన్​, ఐసోలేట్​ను వేగవంతం చేయాలని... వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్షాకాలంలో భారత్​లో ఫ్లూ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడే టెస్టుల సంఖ్యను పెంచి, హాట్​స్పాట్​లలో బాధితులను గుర్తించి, సత్వరమే తగిన చికిత్స అందించాలని సూచించారు.

ఇదీ చదవండి:'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ABOUT THE AUTHOR

...view details