తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2020, 12:54 PM IST

ETV Bharat / bharat

షాకింగ్​ న్యూస్​: భారత్​లో రోజుకు 2.87లక్షల కేసులు!

2021 శీతాకాలం నాటికి దేశవ్యాప్తంగా రోజుకు 2.87లక్షల కేసులు నమోదవుతాయని ఎమ్​ఐటీ పరిశోధకులు అంచనా వేశారు. అప్పటివరకు వ్యాక్సిన్​ అందుబాటులోకి రాకపోతే.. కరోనా సంక్షోభంతో ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్​ నిలుస్తుందని తేల్చిచెప్పారు.

India may see 2.87 lakh COVID-19 cases a day by winter 2021: MIT study
దేశవ్యాప్తంగా రోజుకు 2.87లక్షలు కేసులు!

కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. 2021 శీతాకాలానికి భారత్​లో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదవుతాయని ఎమ్​ఐటీ(మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ) పరిశోధకులు హెచ్చరించారు.

2021 శీతాకాలం నాటికి.. కరోనా వైరస్​ వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్​ నిలుస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. దేశంలో రోజుకు 2.87లక్షల కేసులు వెలుగుచూస్తాయన్నారు. భారత్​ తర్వాత అమెరికా(95,000కేసులు), దక్షిణాఫ్రికా(21,000కేసులు), ఇరాన్​(17,000కేసులు), ఇండోనేషియా(13,000కేసులు) ఉంటాయని పేర్కొన్నారు.

ఈ పరిశోధన కోసం ఎస్​ఈఐఆర్​(ససెప్టబుల్​, ఎక్స్​పోజ్డ్​, ఇన్​ఫెక్షియస్ ​రికవర్డ్​) మోడల్​ను వినియోగించారు. అంటు వ్యాధులకు ప్రామాణికంగా ఎపిడమాలజిస్ట్​లు ఈ మోడల్​ను ఉపయోగిస్తారు.

2021 శీతాకాలం వరకు వ్యాక్సిన్​ లేదా మెరుగైన చికిత్స అందుబాటులోకి రాకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 24.9కోట్ల(249మిలియన్​) కేసులు వెలుగుచూస్తాయన్నారు. 18లక్షలమంది మరణిస్తారని అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details