తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం - సరిహద్దుల్లో రహదారులు నిర్మాణం

చైనా దురాక్రమణ వైఖరిని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం వేగవంతం చేస్తోంది భారత్. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలోని దార్మా లోయకు అనుసంధానించే రహదారి పనులు ఇప్పటికే పూర్తి కావస్తున్నాయి. దీని వల్ల భద్రతా బలగాలతో పాటు స్థానికుల రవాణా సులభతరం అవుతుంది.

China border
రహదారుల నిర్మాణం

By

Published : Jun 26, 2020, 6:48 PM IST

చైనా సరిహద్దు వెంబడి రహదారుల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కీలకమైన చాలా రహదారులు పూర్తి అయ్యాయి. తాజాగా దార్మా లోయను అనుసంధానించే మరో రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.

కేంద్ర ప్రజాపనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) నిర్మిస్తోన్న ఈ మార్గంలో ఏడు వంతెనల్లో ఆరు ఇప్పటికే పూర్తయ్యాయి. రోడ్డు కట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం తర్వాత హాట్​మిక్స్ పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

తొందరగా చేరుకోవచ్చు..

చైనా దురాక్రమణ వైఖరిని దృష్టిలో పెట్టుకుని సరిహద్దు వెంబడి రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది భారత్. ఇప్పటికే లిపులేఖ్ రహదారి ప్రారంభం కాగా... దార్మా లోయలోని దుగ్తుపై దృష్టి సారించింది. ఈ రోడ్డు పూర్తయితే దార్మా లోయలోని 14 గ్రామాలకు రవాణా సులభతరం కానుంది. భద్రతా దళాలు సరిహద్దు చేరుకునే సమయం కూడా తగ్గుతుంది.

సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం

వ్యూహాత్మకంగా కీలకం..

దుగ్తు గ్రామం చైనాలోని జ్ఞానిమా మండీకి అత్యంత సమీపంలో ఉంటుంది. టిబెటన్ మార్కెట్ తక్లాకోట్ తరువాత చైనా జ్ఞానిమా మండీ వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది. ఈ కోణంలో సోబ్లా- దార్మా రహదారి కూడా చాలా కీలకమైనది. అయితే సోబ్లా- దార్మా రహదారిని దుగ్తు వరకు పొడిగించే క్రమంలో భారత ఇంజినీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం- రాజ్​నాథ్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details