తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సామాజిక వ్యాప్తి లేదు.. సన్నిహితుల నుంచే వ్యాప్తి'

భారత్​లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్​ మరోమారు స్పష్టం చేసింది. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62కు పెరిగినట్లు తెలిపింది. కరోనా బాధితుల సన్నిహితులకే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది.

By

Published : Jul 9, 2020, 5:11 PM IST

Updated : Jul 9, 2020, 5:41 PM IST

India has not yet reached community transmission stage of COVID-19; there have been some localised outbreaks: Health Ministry
'భారత్​లో సామాజిక వ్యాప్తి లేదు.. రోజుకు 2.6లక్షల పరీక్షలు'

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి దశ ప్రారంభంకాలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) పునరుద్ఘాటించింది. కరోనా బాధితులకు సన్నిహితంగా ఉన్నవారికే వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం 62కు పెరిగినట్లు ఐసీఎంఆర్ సీనియర్‌ శాస్త్రవేత్త నివేదితా గుప్తా ప్రకటించారు. 60-75 ఏళ్ల వయసు వారిలోనూ రికవరీ రేటు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం రోజుకు 2.6లక్షల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నివేదిత. యాంటిజెన్‌ పరీక్షలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు.

వ్యాక్సిన్​ అభివృద్ధిలో భద్రతా ప్రమాణాలపై రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గాలి ద్వారా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: స్వచ్ఛ భారత్​కు జైకొడుతూ మోదీకి వెండి విగ్రహం

Last Updated : Jul 9, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details