తెలంగాణ

telangana

భారత్​లో మే వరకే 64 లక్షల మందికి కరోనా!

By

Published : Sep 11, 2020, 7:34 AM IST

ఈ ఏడాది మే ప్రారంభం నాటికి దేశంలో 64 లక్షల మంది వైరస్​ బారినపడ్డారని భారత అత్యున్నత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) అంచనా వేసింది. 28వేల మంది రక్తనమూనాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 0.73 శాతం మంది వయోజనులు కరోనాకు గురైనట్లు ఈ పరిశోధనలో తేలింది.

National serosurvey
భారత్​లో మే నెలలోనే 64 లక్షల మందికి కరోనా!

భారత్‌లో మే ప్రారంభం నాటికి 64 లక్షల మంది కరోనా బారినపడ్డారని భారత అత్యున్నత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) అంచనా వేసింది. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 28 వేల మంది రక్తనమూనాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించింది.

కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి నిర్వహించిన సెరోసర్వే ఫలితాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ప్రచురించింది. దీని ప్రకారం దేశంలో 64,68,388 మంది (0.73 శాతం) వయోజనులు కరోనాకు గురైనట్లు వెల్లడైంది. ఈ సర్వేను మే 11 నుంచి జూన్‌ 4 మధ్యలో నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

18 నుంచి 45 ఏళ్ల మధ్య వారిలో సెరోపాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతంగా ఉండగా.. 46- 60 ఏళ్ల వయస్సు వాళ్లకి 39.5 శాతంగా, 60 ఏళ్లు పైబడిన వాళ్లల్లో అత్యల్పంగా 17.2 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

దేశంలో చాలా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉండగా.. వైరస్‌ వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధరిస్తున్నారు. ఈ ఫలితాలు అనుమానితులను పరీక్షించడం, వేరుచేయడం వంటి వైరస్‌ నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: 'ర్యాపిడ్'​లో నెగెటివ్ వస్తే మళ్లీ టెస్టు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details