తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్తార్​పుర్​​ నడవాను సకాలంలో పూర్తి చేస్తాం' - MEA

కర్తార్‌పుర్ నడవా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను ఖండించింది విదేశీ వ్యవహారాలశాఖ. నడవా నిర్మాణానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పనులను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్​.

'కర్తార్​పుర్​​ నడవాను సకాలంలో పూర్తి చేస్తాం'

By

Published : Jul 12, 2019, 6:37 AM IST

Updated : Jul 12, 2019, 7:29 AM IST

కర్తార్​పుర్​​ నడవా

కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్​. నడవా నిర్మాణపనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను రవీశ్​ ఖండించారు​. పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి పాకిస్థాన్​ కర్తార్​పుర్‌కు నేరుగా రాకపోకలు సాగించేందుకు వీలుపడే ఈ​ నడవాను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. నాలుగు వరుసల రహదారితో పాటు ప్రయాణ ప్రాంగణాన్ని త్వరగా నిర్మిస్తామన్నారు. రెండు ప్రాజెక్టుల పనులకు ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్ నాటికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.

"భారత్​ కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలనుకుంటున్నాం."
- రవీశ్​కుమార్​, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

ఈ నెల 14న మరో భేటీ

రూ. 177.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ నడవా నిర్మాణంపై ఇరుదేశాల అధికారులు తొలిసారి ఈ ఏడాది మే 14న వాఘా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. ఈ నెల 14న మరోసారి సమావేశమవనున్నారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై చర్చతోపాటు పెద్ద సంఖ్యలో యాత్రికులను అనుమతించడం సహా యాత్రికులకు సౌకర్యాలు అందించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వరదల సమయంలో...... భారత్‌కు ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగకుండా నిర్మాణాలు చేపట్టాలని పాకిస్థాన్‌కు కేంద్రం సూచించింది.

Last Updated : Jul 12, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details