తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2020, 5:38 AM IST

ETV Bharat / bharat

సౌదీ కరెన్సీ నోటుపై భారత్ ఆందోళన

సౌదీ అరేబియా ప్రత్యేకంగా తీసుకొచ్చిన కరెన్సీ నోటుపై భారత సరిహద్దులను సరిగా నిర్వచించకపోవటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేసింది.

SAUDI-MAP-INDIA
సౌదీ కరెన్సీ నోటు

జీ-20 దేశాల సదస్సు సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక కరెన్సీ నోటుపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా ముద్రించటం పట్ల నిరసన తెలిపినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది.

సౌదీ 20 రియాల్ నోటు వెనకభాగంలో ప్రపంచ పటాన్ని ముద్రించింది. ఇందులో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​.. భారత్​లో అంతర్భాగంగా చూపించలేదు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడారు.

"మీరు ముద్రించిన నోటులో భారత ప్రాదేశిక సరిహద్దులు సరిగా లేవు. సౌదీ అరేబియా తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. భారత్​లో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ అంతర్భాగం. ఈ విషయంలో ఇరు దేశాల్లో ఉన్న రాయబారుల ద్వారా సౌదీకి మా ఆందోళన వ్యక్తం చేశాం."

- అనురాగ్​ శ్రీవాస్తవ

ప్రత్యేక నోటు..

రియాద్‌లో వచ్చే నెల 21,22 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు సౌదీ అధ్యక్షత వహించనుంది. ఈ నేపథ్యంలో 20 రియాల్స్ నోటును అక్టోబర్​ 24న విడుదల చేసింది. ఇందులో ముద్రించిన జీ-20 దేశాలను వేర్వేరు రంగుల్లో చూపించారు.

సౌదీ కరెన్సీ నోటు

ఈ పటంలో పాకిస్థాన్​కు సంబంధించి గిల్గిత్- బాల్టిస్థాన్​, పీఓకేనూ భాగంగా చూపించలేదు. అయితే, మిత్ర దేశమైన సౌదీ ఈ చర్యకు దిగటం పాకిస్థాన్​కు భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:పాకిస్థాన్​కు సౌదీ షాక్.. భారత్​కు దీపావళి కానుక!

ABOUT THE AUTHOR

...view details