తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వచ్చేవారం భారత్​- చైనా మధ్య ఐదోరౌండ్​ చర్చలు - high level military talk

సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణ కోసం భారత్- చైనా మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఐదో రౌండ్ సైనిక కమాండర్ స్థాయి చర్చలు వచ్చేవారం జరగనున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల సైనిక కమాండర్లు నాలుగుసార్లు భేటీ అయ్యారు.

india china
భారత్​- చైనా మధ్య ఐదో రౌండ్ చర్చలు.. వచ్చేవారం

By

Published : Jul 26, 2020, 2:39 PM IST

Updated : Jul 26, 2020, 4:32 PM IST

భారత్​- చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలో.. ఐదో రౌండ్ చర్చలు వచ్చేవారం జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​ నుంచి బలగాలను వెనక్కి తరలించే లక్ష్యంతో రెండు దేశాల కమాండర్ల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగాయి. అయితే పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17ఏ వద్ద నుంచి పూర్తిస్థాయిలో సైనిక ఉపసంహరణ జరగలేదు. ఈసారి అదే లక్ష్యంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు సైనిక అధికారులు.

"ఇరు దేశాల సైన్యానికి చెందిన సీనియర్ కమాండర్లు.. పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిస్థాయిలో సైనిక ఉపసంహరణే లక్ష్యంగా వచ్చేవారం సమావేశం కానున్నారు."

-సైనికాధికారుల ప్రకటన

ఆ ప్రాంతాలే సమస్య

పాంగాంగ్ సరస్సు వద్దనున్న 5, 8వ ఫింగర్ పాయింట్ల వద్ద నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చేవారం జరనున్న చర్చల్లో ఆయా ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్ పట్టుపట్టే అవకాశం ఉంది.

'వెనక్కి వెళ్తేనే దౌత్య సంబంధాలు'

శుక్రవారం ఇరుదేశాల దౌత్యాధికారుల మధ్య చర్చ జరిగింది. ఇందులో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని నొక్కి చెప్పింది భారత్. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చైనా తన సైన్యాన్ని వెనక్కి తరలించాల్సిందేనని వెల్లడించింది.

ఇదీ చూడండి:తల్లడిల్లిన తల్లి హృదయం.. స్కూటీపైనే 1800 కి.మీ!

Last Updated : Jul 26, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details