తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి మళ్లాల్సిందే!'

భారత్​-చైనా దేశాలు శనివారం.. మేజర్​ జనరల్​ స్థాయిలో భేటీ అయ్యాయి. దౌలత్​ బేగ్​ ఓల్దీ వేదికగా జరిగిన చర్చల్లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించాయి.

By

Published : Aug 8, 2020, 7:50 PM IST

India, China holding Major General-level talks over disengagement by Chinese side along LAC
ముగిసిన భారత్​- చైనా మేజర్​ జనరల్​ స్థాయి చర్చలు

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా దేశాలు మేజర్​ జనరల్​ స్థాయిలో శనివారం సమావేశమయ్యాయి. లద్దాఖ్​​ సెక్టార్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల అధికారులు చర్చించినట్టు సైన్యాధికారుల సమాచారం.

"దౌలత్​ బేగ్​ ఓల్దీ ప్రాంతంలో ఇరు దేశాలు మేజర్​ జనరల్​ స్థాయిలో సమావేశమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల ఉపసంహరణపై చర్చించాయి."

--- భారత సైన్యం.

ముఖ్యంగా దేప్సంగ్​​ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై ఇరువర్గాలు దృష్టి సారించాయి. ఆ ప్రాంతంలో చైనా 17వేల సైనికులను మోహరించగా.. అందుకు దీటుగా భారత్​ 15వేల జవాన్లను తరలించింది. ఇక్కడి నుంచి చైనా వెనక్కితరలాలని భారత్​ పట్టుబడుతోంది.

మే నెలలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల ఇప్పటికే అనేకమార్లు మిలిటరీ, దౌత్య స్థాయిలో సమావేశమయ్యాయి. ఇటీవలే వీటి మధ్య ఐదో దఫా కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో చర్చలు ముగిశాయి. చైనా దళాలు పూర్తి స్థాయిలో వెనుదిరిగి.. మే 5కు ముందున్న యథాతథ స్థితిని నెలకొల్పాలని భారత్​ తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి:-'సరిహద్దులో కమాండర్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details