తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2020, 2:52 PM IST

Updated : Jun 24, 2020, 7:45 PM IST

ETV Bharat / bharat

'ఆ నిర్ణయం అమలు చేస్తేనే సరిహద్దులో శాంతి'

భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయి చర్చలు
india-china-holding-diplomatic-talks-to-ease-border-tension

19:26 June 24

ఆ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలి...

తూర్పు లద్దాఖ్​లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై కుదిరిన అంగీకారాన్ని కఠినంగా అమలు చేయాలని భారత్​-చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్​-చైనా మధ్య దౌత్య స్థాయిలో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ.

చైనా విదేశాంగ శాఖ డైరక్టర్​ జనరల్​ వూ జియాంగ్​వో, భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్​ శ్రీవాస్తవ.. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో గల్వాన్​ ఘటన సహా తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాకు భారత్​ తన ఆందోళనను వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోడానికి దౌత్య, మిలిటరీ స్థాయిలో సమాచారాలను ఇచ్చిపుచ్చుకునేందుకు అధికారులు అంగీకరించారు.  

ఇదీ జరిగింది...

వాస్తవాధీన రేఖ వెంబడి.. మే నెల నుంచి భారత సైనికులపైకి చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నెల 15న గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గల్వాన్​ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. 

19:02 June 24

ఆధికారుల మధ్య సుదీర్ఘ చర్చ...

భారత్​-చైనా మధ్య బుధవారం దౌత్య స్థాయిలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో గల్వాన్​ ఘటన సహా తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతలపై ​భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది.

సమస్య పరిష్కారానికి దౌత్య, మిలిటరీ స్థాయిలో చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. 

15:23 June 24

భారత్​-చైనా దౌత్య స్థాయి చర్చలు...

సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగాయి. భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్​ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరక్టర్​ జనరల్​ వూ జియాంగ్​వో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇదే విషయంపై సోమవారం భారత్​-చైనా మధ్య మిలిటరీ స్థాయిలో చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్​​లో ఉద్రిక్తతలు తగ్గించేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 

ఇదీ జరిగింది...

వాస్తవాధీన రేఖ వెంబడి.. మే నెల నుంచి భారత సైనికులపైకి చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నెల 15న గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గల్వాన్​ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. 

14:53 June 24

దౌత్య స్థాయి అధికారులు...

విదేశాంగ శాాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్​ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరక్టర్​ జనరల్​ వూ జియాంగ్​వో మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. లద్ధాఖ్​లోని వాస్తవాధీని రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు.

14:46 June 24

భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయి చర్చలు

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం అధికారులు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు.

Last Updated : Jun 24, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details