కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పుణెలో జరిగిన.. 'విద్యార్థులతో ముఖాముఖి'లో పలు ఆసక్తికర సమాధానాలిచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
రాహుల్ ఏమన్నారంటే...
⦁ మహిళలకు పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరతాం.
⦁ న్యాయ్ పథకానికి డబ్బు అనిల్ అంబానీ, నీరవ్ మోదీ వంటి వారి నుంచే సేకరిస్తాం.
⦁ బాలాకోట్ దాడుల కీర్తి వాయుసేనకే చెందుతుంది.
⦁ నీతి ఆయోగ్ స్థానంలో పటిష్ఠ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేస్తాం.
⦁ న్యాయ్ పథకం కోసం ఆదాయ పన్నులు పెంచం.
⦁ కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించే ముందు వివిధ రంగాల నిపుణులను సంప్రదించాం.
తన బయోపిక్లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పని'తో తనకేనాడో వివాహమైందన్నారు.
విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి