తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా బాధితులకు కాపలా కాస్తున్న గ్రామస్థులు - కరోనా బాధితులకు గస్తీ

కరోనా నిర్బంధ కేంద్రాల నుంచి బాధితులు పారిపోతున్న ఘటనలను తరుచూ చూస్తూనే ఉన్నాం. వారి నిర్లక్ష్యంతో వైరస్​ వ్యాప్తికి బాటలు పరిచినట్లే అవుతుంది. ఈ తరుణంలో అసోం బోకో ప్రాంత ప్రజలు వినూత్న ఆలోచన చేశారు. ఎవరూ పారిపోకుండా చెక్​పోస్టును ఏర్పాటు చేసి.. షిఫ్టుల వారీగా గ్రామస్థులే కాపలా కాస్తున్నారు.

In Assam villagers guard quarantine centre to stop fleeing COVID 19 suspects
కరోనా బాధితులకు కాపలా కాస్తున్న గ్రామస్థులు

By

Published : Jun 28, 2020, 7:30 PM IST

కరోనా నిర్బంధ కేంద్రం నుంచి బాధితులు పారిపోకుండా చెక్​పోస్టును ఏర్పాటు చేశారు అసోంలోని బోకో ప్రాంత వాసులు. గ్రామస్థులే షిఫ్టుల వారీగా స్వచ్ఛందంగా కాపలా కాస్తున్నారు.

కరోనా బాధితులకు కాపలా కాస్తున్న గ్రామస్థులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోకో ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ కళాశాలను నిర్బంధ కేంద్రంగా మార్చారు అధికారులు. అయితే కొంతమంది బాధితులు కేంద్రం నుంచి పారిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సకాబాహా, జరపారా, మౌమన్ గ్రామస్థులు ఎవరూ పారిపోకుండా కాపలా కాసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇందుకోసం చెక్​పోస్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు.

"కరోనా నిర్బంధ కేంద్రం నుంచి ఎవరు పారిపోకుండా మేము కాపలాగా ఉంటున్నాం. బాధితులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే వైరస్​ను వ్యాప్తి చేస్తారు. అప్పుడు మహమ్మారి అనేక మంది జీవితాలను అపాయంలోకి నెట్టి వేస్తుంది. మూడు షిఫ్టుల వారీగా రోజూ 8 గంటలపాటు కాపలా కాస్తున్నాం. ఒక్కొక్క షిఫ్టుకు ఆరుగురం ఉంటున్నాం."

-స్థానికులు

ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఆరు నిర్బంధ కేంద్రాల నుంచి 44 మంది బాధితులు పారిపోయినట్లు తెలియడం వల్ల అప్పటి నుంచి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గ్రామస్థులు.

కరోనా వేగంగా విస్తరిస్తోన్న కారణంగా గౌహతి నగరంలో మరో 14 రోజుల పాటు లాక్​డౌన్​ను ప్రకటించాలని భావిస్తోంది అసోం సర్కార్​. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వారాంతపు లాక్​డౌన్​ను విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం ఏడు వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు అధికారులు. వీరిలో 4,814 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ కాగా.. 2,338 మంది చికిత్స పొందుతున్నారు. 10 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:భారీ వర్షం.. మంత్రి ఇల్లు జలమయం

ABOUT THE AUTHOR

...view details