దేశంలోనే తొలిసారి వరి పొలాల రైతులకు రాయల్టీ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది కేరళ. సాగులో ఉన్న వరి పంటకు వార్షిక ప్రాతిపదికన హెక్టార్కు రూ.2 వేలు రాయల్టీగా ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
రాయల్టీ ఎందుకంటే..
వరి పొలాల యజమానులకు రాయల్టీ ఇవ్వడం ఇదే ప్రథమమని కేరళ వ్యవసాయ శాఖ తెలిపింది. వరి పంట నిల్వ, నిర్వహణ, పోత్సాహానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వరి పండే పొలాలను ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా ఉండేదుకు కూడా రాయల్టీ ఉపయోగపడుతుందని వివరించింది. రాయల్టీ కోసం ఈ ఏడాది రూ.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో పండించే పంటలకు కనీస ధర నిర్ణయించే విధానం ఈ నెల ఆరంభం నుంచే అమలులోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు రాయల్టీ పథకాన్ని ప్రకటించడం గమనార్హం.
ఇదీ చూడండి:రైతులకు కేరళ ప్రభుత్వం అండ.. కనీస ధర ప్రకటన