తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచమంతా భారత్​ వెంటే : సుష్మా - సుష్మా స్వరాజ్

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను చైనా అడ్డుకోవటం దౌత్యపరమైన వైఫల్యమని వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​.  2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదటిసారి అజార్​పై ఈ  ప్రతిపాదనను తెచ్చినప్పుడు భారత్​ ఒంటరిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పారు.

ప్రపంచమంతా భారత్​ వెంటే

By

Published : Mar 15, 2019, 7:18 PM IST

మసూద్​ అజార్​ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవటం... దౌత్యపరమైన వైఫల్యమనే ఆరోపణలను తిప్పికొట్టారు.

2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మొదటిసారి ప్రతిపాదించినపుడు భారత్​ ఏకాకిగా ఉందని గుర్తుచేశారు సుష్మా. కానీ ఇప్పుడు భారత్​కు ప్రపంచవ్యాప్తంగా చైనా మినహా అన్ని దేశాల మద్దతు లభించిందని తెలిపారు.

చైనా అధ్యక్షుడికి మోదీ బయపడుతున్నారని రాహుల్​ గాంధీ ఆరోపణలు చేసిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేశారు సుష్మా. అజార్​ను నిషేధించాలన్న ప్రతిపాదనపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు ట్విటర్​ వేదికగా తెలిపారు.

" నాలుగు సార్లు ప్రతిపాదన తీసుకొచ్చాం. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్​ ఏకాకిగా ఉంది. 2016లో భారత ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్​ మద్దతు పలికాయి. 2017లో అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ ప్రతిపాదనలు చేశాయి. " -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

"ఇప్పుడు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ ప్రతిపాదించగా ఐరాస భద్రతా మండలిలోని 14 దేశాలు మద్దతు పలికాయి. వాటితో పాటుగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​, ఇటలీ, జపాన్​లు సైతం ప్రతిపాదనకు మద్దతుగా నిలిచాయి. " -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

" నేను ఈ నిజాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. దౌత్యపరమైన వైఫల్యంగా చెబుతున్న నాయకులు... 2009లో భారత్​ ఏకాకిగా ఉందని గ్రహించాలి. ఇప్పుడు(2019) భారత్​కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉంది." -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details