తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉత్తర భారతంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు'

ఉత్తర భారతంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ చేసింది.

By

Published : Aug 27, 2020, 5:57 AM IST

IMD: North to witness intense rainfall over next 4 days; orange alert for U'khand for Aug 27-28
'ఉత్తర భారతంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు'

గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్​లో గురువారం ఆరెంజ్​ అలర్ట్​, శుక్రవారం యెల్లో అలర్ట్​ను ప్రకటించింది.

ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్​(శుక్రవారం), తూర్పు రాజస్థాన్​(శని,ఆది)కు ఆరెంజ్​ అలర్ట్​, జమ్ముకశ్మీర్​(గురువారం), హిమాచల్​ ప్రదేశ్​(గురు,శుక్ర), పంజాబ్​(గురు,శుక్ర), హరియాణా-దిల్లీ(గురు,శుక్ర,శని), పశ్చిమ రాజస్థాన్​(శని, ఆది)కు యెల్లో అలర్ట్​ను జారీ చేసింది.

ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనేక నదులు ఉప్పొంగి, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో మంగళవారం నాటికి 19 జిల్లాలు వరదలకు దెబ్బతిన్నాయి. దాదాపు 1,090 గ్రామాలు జలమయమయ్యాయి.

ఇదీ చూడండి:-దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్

ABOUT THE AUTHOR

...view details