భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)ను వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం-ఐఎంఏ నేడు బంద్కు దిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె... 24 గంటలపాటు కొనసాగనుంది. బంద్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.
ఈ బంద్కు దేశవ్యాప్తంగా జూడాలు, కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.