తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు - వైద్య సేవలు బంద్​

దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. భారతీయ వైద్య మండలి స్థానంలో ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభలో ఆమోదం లభించడానికి వ్యతిరేకంగా భారతీయ వైద్య సంఘం బంద్ చేపట్టింది. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వైద్య సేవలు బంద్

By

Published : Jul 31, 2019, 6:31 AM IST

Updated : Jul 31, 2019, 7:27 AM IST

భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్(ఎన్​ఎంసీ)ను వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం-ఐఎంఏ నేడు బంద్​కు దిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె... 24 గంటలపాటు కొనసాగనుంది. బంద్​ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.

ఈ బంద్​కు దేశవ్యాప్తంగా జూడాలు, కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.

సర్వత్రా ఆందోళనలు...

ఎన్​ఎంసీ బిల్లుకు ఇటీవలే లోక్​సభలో ఆమోదం లభించింది. బిల్లును నిరసిస్తూ 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు దిల్లీ వేదికగా సోమవారం నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.

ఇదీ చూడండి: వేతన కోడ్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Last Updated : Jul 31, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details