తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసి భర్తను చంపి బావిలో పడేసిన ప్రియుడు

'అక్రమ సంబంధం' కోసం.. ప్రేయసి బొట్టు చెరిపేశాడు కర్ణాటకకు చెందిన ఓ ప్రియుడు. ఇంకొకరి భార్యతో సంబంధం పెట్టుకోవడమే కాక, వారి పాడు బంధాన్ని ప్రశ్నించినందుకు భర్తను చంపి బావిలో పడేశాడు. ఎట్టకేలకు దాదాపు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు.

By

Published : Jun 29, 2020, 2:53 PM IST

Updated : Jul 5, 2020, 10:56 PM IST

Illegal relationship with wife; The husband who questioned was killed and thrown into the well
ప్రేయసి భర్తను చంపి బావిలో పడేసిన ప్రియుడు!

కర్ణాటక బెళగావిలో దారుణం జరిగింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన ఆమె భర్తను కడతేర్చాడో ఉన్మాది.

బెళగావి జిల్లా అథని మండలం సత్తి గ్రామంలో నివసిస్తాడు మహాంతేశ్​ పుండలిక్ గైక్వాడ్. కొద్దిరోజులగా మహారాష్ట్ర జట్టా తాలూకా ధారేబడచి గ్రామానికి చెందిన.. గంగయ్య సిద్ధయ్య స్వామి(32) భార్య.. శోభ స్వామితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి బంధాన్ని ప్రశ్నించినందుకు గంగయ్యను చంపి బావిలో పడేశాడు మహాంతేశ్​.

ఏప్రిల్​ 30 నుంచి తన భర్త కనిపించట్లేదని మే 5న అథని పోలీసులకు ఫిర్యాదు చేసింది శోభ. గంగయ్య కోసం వెతికే క్రమంలో.. పోలీసులకు బావిలో మృతదేహం దొరికింది. నిందితులు మహాంతేశ్​ సహా... అథని పట్టణానికి చెందిన రాహుల సంజయ షిండే, రాదేరహట్టి గ్రామానికి చెందిన విజయ జ్ఞానేశ్వర్​ను అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి: ది ఒడ్డున ఇసుకలోనే ప్రసవ వేదన

Last Updated : Jul 5, 2020, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details