తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈటీవీ భారత్​' రిపోర్టర్​పై అక్రమ కేసులు- హైకోర్టు మందలింపు

బంగాల్​లో 'ఈటీవీ భారత్​' రిపోర్టర్​ అభిషేక్​ దత్తాపై కేసులు నమోదు చేయడంపై కోల్​కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్​కు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ.. పాత్రికేయుల గొంతును నొక్కేందుకే ఈ కేసులు అని వ్యాఖ్యానించింది.

By

Published : Aug 4, 2020, 1:29 PM IST

Updated : Aug 4, 2020, 1:50 PM IST

bengal etv bharat reporter
ఈటీవీ భారత్

పాత్రికేయుల గొంతు నొక్కేందుకే 'ఈటీవీ భారత్' రిపోర్టర్​పై కేసులు నమోదు చేశారని కోల్​కతా హైకోర్టు తప్పుబట్టింది. బీర్​భమ్​ జిల్లాకు చెందిన పాత్రికేయుడు అభిషేక్​ దత్తా రాయ్​ ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారించిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

అభిషేక్ తరఫున న్యాయవాదులు జయంత నారాయణ్ చటోపాధ్యాయ, నజీర్ అహ్మద్ వాదనలు వినిపించారు. కేసులో వాదనలు విన్న తర్వాత జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ సౌమెన్​ సేన్​ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

"ఏమైనా అక్రమ కార్యకలాపాలకు సంబంధించి నిజాయితీగా వార్తను ప్రచురించే హక్కు పాత్రికేయులకు ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇది సాయపడుతుంది. విలేకరి గొంతును నొక్కేయడానికే ఈ కేసులు నమోదు చేసినట్లు గుర్తించాం."

- కోల్​కతా హైకోర్టు

విచారణకు ఆదేశం..

అభిషేక్​పై ఎఫ్​ఐఆర్​ నమోదుకు సంబంధించి విచారణ చేపట్టాలని బీర్​భమ్​ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. రిపోర్టర్​ ఆరోపించిన అక్రమ ఇసుక మైనింగ్ విషయంలో దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..

బీర్​భమ్​ జిల్లాలో అక్రమ ఇసుక మైనింగ్​ వ్యవహారాన్ని 'ఈటీవీ భారత్' ప్రతినిధి అభిషేక్​ వెలుగులోకి తెచ్చారు. అయితే... నిందితులపై చర్యలను తీసుకోకుండా అభిషేక్​పై మూడు చోట్ల కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్​ కోసం కోల్​కతా హైకోర్టును ఆశ్రయించారు అభిషేక్.

ఇదీ చూడండి:జవాన్లపై అధికారి కాల్పులు- ఇద్దరు మృతి

Last Updated : Aug 4, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details