తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2020, 12:01 PM IST

ETV Bharat / bharat

'ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మళ్లీ టెస్ట్ చేయాల్సిందే'

కరోనా నిర్ధరణకు ర్యాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది భారత వైద్య పరిశోధన మండలి. యాంటిజెన్​ టెస్టులో నెగిటివ్​ వస్తే ఆ శాంపిళ్లను ఆర్​టీ-పీసీఆర్​ ద్వారా పరీక్షించాలని సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నిబంధనలను వెల్లడించింది.

ICMR
భారత వైద్య పరిశోధన మండలి

యాంటిజెన్​ నిర్ధరణ పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) మరికొన్ని సిఫార్సులను జారీ చేసింది. ఫలితం నెగిటివ్​ వచ్చినప్పుడు ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ తో కలిపి స్టాండర్డ్​ క్యూ కొవిడ్​- 19 యాంటిజెన్​ నిర్ధరణ పరీక్ష నిర్వహించాలని సూచనలు చేసింది.

ర్యాపిడ్ యాంటిజెన్​ పరీక్షల ద్వారా నెగిటివ్ వస్తే.. వారి శాంపిళ్లను మళ్లీ ఆర్​టీ- పీసీఆర్​ ద్వారా నిర్ధరించాలని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. పాజిటివ్​ వచ్చినట్లయితే కరోనా సోకినట్లు ధ్రువీకరించాలని, అప్పుడిక ఆర్​టీ-పీసీఆర్​ అవసరం లేదని పేర్కొంది.

స్టాండర్డ్​ క్యూ యాంటిజెన్​ నిర్ధరణలో టెస్టింగ్​ కిట్​కు శాంపిల్​ను అందించగానే గరిష్ఠంగా 30 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుంది. ఈ కిట్​ను 2-30 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సున్నితత్వం ఉన్న నేపథ్యంలో ఆర్​టీ-పీసీఆర్​తో కొన్ని సెట్టింగ్​ కాంబినేషన్లతో కలిపి ధ్రువీకరించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ స్ఫష్టం చేసింది. ఏయే సందర్భాల్లో దీనిని అనుసరించాలో వివరణ ఇచ్చింది.

ఏ. కంటెన్మెంట్ జోన్​ లేదా హాట్​స్పాట్​

వీరికి నిర్బంధ వైద్య పర్యవేక్షణ ఉండాలి. కిట్​ ఉష్ణోగ్రత 2-30 డిగ్రీల సెల్సియస్​ మధ్య స్టోర్ చేయాలి.

  • ఇన్​ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష చేయాలి.
  • లక్షణాలు లేకున్నా.. పాజిటివ్​ కేసులతో సన్నిహితంగా ఉన్న (ఇప్పటికే ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్ర పిండాల, డయాబెటిస్​, నరాలు, రక్త హీనత వంటి సమస్యలతో బాధపడుతున్న)వారికి 5 నుంచి 10 రోజుల్లో పరీక్ష నిర్వహించాలి.

బీ. హెల్త్​ కేర్ సెట్టింగ్స్​

  • ఆరోగ్య సంరక్షణ విభాగంలో పనిచేస్తున్నవారిలో ఇన్​ఫ్లూయెంజా లక్షణాలు కనిపించినా, వారికి కరోనా సోకినట్లు అనుమానం కలిగినా..
  • ఆసుపత్రిలో చేరి లక్షణాలు లేకపోయినా, కీమోథెరపీ, హెచ్​ఐవీ పాజిటివ్​, అవయమ మార్పిడి, వృద్ధులు, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు..
  • శస్త్ర చికిత్స చేయించుకున్నవారిలో లక్షణాలు లేకపోయినా యాంటిజెన్​తో కలిపి నిర్ధరించాలి.

ఇన్​ఫ్లూయెంజా లక్షణాలు..

  • శ్వాసకోశ ఇబ్బందులు
  • 38 డిగ్రీలకు మించిన శరీర ఉష్ణోగ్రత
  • తీవ్రమైన దగ్గు

పైన పేర్కొన్న ఏ,బీ కేటగిరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్​ టెస్ట్​ను సిఫార్సు చేసింది ఐసీఎంఆర్. అయితే వీటికి కొన్ని పరిమితులు విధించింది.

  • యాంటిజెన్​ టెస్టులో నెగటివ్ వచ్చినవారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి.
  • శాంపిళ్లను పూర్తి స్థాయి పీపీఈలను ధరించి, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది మాత్రమే సేకరించాలి.
  • శాంపిల్​ సేకరించిన గంటలోపు వైద్య పర్యవేక్షణలో నిర్ధరణ పరీక్ష చేయాలి.

కొన్ని ఇబ్బందుల కారణంగా..

కరోనా నిర్ధరణలో ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​కు ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఆర్​టీ-పీసీఆర్​ యంత్రాల్లో రెండు రకాలు ఉన్నాయని తెలిపింది. భారత్​లో ప్రస్తుతం ఓపెన్​ ఆర్​టీ-పీసీఆర్​, ట్రూనాట్​, సీబీఎన్​ఏఏటీ విధానాలను ఉపయోగిస్తున్నారు.

అయితే వీటన్నింటికి అన్నిరకాల భద్రతతో కూడిన ప్రత్యేక ల్యాబ్ సదుపాయం కావాలి. ఒక శాంపిల్​ను పరీక్షించేందుకు కనీసం 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ కారణాలతో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు పరిమితంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ర్యాపిడ్ యాంటిజెన్​ టెస్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది ఐసీఎంఆర్.

అయితే ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చే యాంటిజెన్​ టెస్టులు లేవని, అందువల్ల వ్యూహత్మకంగా వీటిని ఉపయోగించేందుకు సిద్ధమైంది ఐసీఎంఆర్.

ఇదీ చూడండి:ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతోనే కరోనాపై విజయం!

ABOUT THE AUTHOR

...view details