చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్తో ఎయిర్ మార్షల్ రాజేశ్ కుమార్ భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి సదుపాయాల ఏర్పాటు కోసం భూమి ఇవ్వాలని కోరారు.
ఈ భేటీలో వ్యూహాత్మక ప్రాముఖ్యం కారణంగా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో వాయు రక్షణ రాడార్లు, ముందస్తు ల్యాండింగ్ గ్రౌండ్ను నిర్మించడానికి భూమి లభ్యతపై చర్చించారు. చౌఖుటియాలో విమానాశ్రయానికి భూమిని కేటాయించటంతో పాటు పంత్నగర్, జాలీగ్రాంట్, పితోర్గఢ్ ఎయిర్పోర్టులను విస్తరించాలని ఎయిర్ మార్షల్ కోరారు.