తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం - క్షిపణి

అత్యంత శక్తిమంతమైన సూపర్​సోనిక్​ బ్రహ్మోస్ క్రూయిజ్​​ క్షిపణిని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. సు-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ఈ ప్రయోగం నిర్వహించింది.

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

By

Published : May 22, 2019, 10:56 PM IST

భారత వాయుసేన అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 300 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి ప్రయోగాన్ని సు-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా నిర్వహించింది. ధ్వని కన్నా దాదాపు మూడు రెట్లు వేగంగా ప్రయాణించగల సామర్థ్యం ఈ బ్రహ్మోస్ ప్రత్యేకత. ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా అవతరించింది.

నవంబర్​ 22, 2017లో మొదటిసారి ఇదే తరహా ప్రయోగాన్ని సముద్రంపై విజయవంతంగా నిర్వహించింది వాయుసేన.

బ్రహ్మోస్​ క్షిపణి ప్రయోగాన్ని రెండోసారి.. నేలపై లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం ప్రయోగించారు. ఈ ప్రయోగంతో భారత వాయుసేన సామర్థ్యం బలోపేతమైందని పేర్కొన్నారు ఐఏఎఫ్​ ప్రతినిధి అనుపమ్​ బెనర్జీ.

ఇదీ చూడండి: 'రఫేల్​' కార్యాలయంలో చోరీకి యత్నం...!

ABOUT THE AUTHOR

...view details