తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏఎన్​-32' కోసం గాలింపు చర్యలు ముమ్మరం

అసోం సరిహద్దుల వద్ద అదృశ్యమైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్​-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్రివిధ దళాలు, ఇండో టిబెటెన్​ బోర్డర్​ పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు.

By

Published : Jun 5, 2019, 11:42 PM IST

Updated : Jun 5, 2019, 11:49 PM IST

'ఏఎన్​-32' కోసం గాలింపు చర్యలు ముమ్మరం

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్​-32 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరుణాచల్​ప్రదేశ్​, అసోం ప్రాంతాల్లో అణువణువూనూ శోధించేందుకు ఇస్రో శాటిలైట్లు సహాయం అందిస్తున్నాయి.

అరుణాచల్​ప్రదేశ్​ పశ్చిమ సియాంగ్​ జిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఈ విమానంలో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం చైనా సరిహద్దుల్లో ఉన్న మెంచుకా అడ్వాన్స్​డ్​ లాండింగ్ గ్రౌండ్​కు చేరుకావాల్సి ఉంది.

వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యల కోసం నావికా దళానికి చెందిన 'పీ 8 ఐ ఎస్​పీవై' విమానాలు వినియోగిస్తున్నారు.

భారత వైమానిక దళానికి చెందిన రెండు సుఖోయ్​ 30, సీ 130జే సూపర్ పెర్యూలస్​ యుద్ధ విమానాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. భారత సైన్యం, ఇండో టిబెటన్ బోర్డర్​ పోలీసులు, రాష్ట్రపోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ చర్యలన్నింటినీ రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

ఎందుకు పక్కన పెట్టడంలేదు..

విమానం గల్లంతైన ఘటనపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తం చేసింది. వాడుకలో లేని ఏఎన్​-32 విమానాల స్థానంలో అధునాతన విమానాలు ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇంతకు మునుపు అండమాన్​, నికోబార్​ వద్ద కూడా ఇలాగే ఏఎన్​-32 విమానం గల్లంతైంది. ఇప్పటివరకు దాని ఆచూకీ లభ్యం కాలేదు. అయినా ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదో రక్షణమంత్రి వివరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. విమానంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారాయన.

ఇదీ చూడండి: భద్రతపై ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ

Last Updated : Jun 5, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details