తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గగన్​యాన్​: వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తి

ఇస్రో చేపట్టబోయే మరో ప్రతిష్టాత్మక మిషన్​ గగన్​యాన్​కు సంబంధించి వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తయింది. ఈ మేరకు భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎంపికైన టెస్ట్​ పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

By

Published : Sep 6, 2019, 11:55 PM IST

Updated : Sep 29, 2019, 5:29 PM IST

భారత వాయుసేన

మరికొన్ని గంటల్లో చంద్రయాన్​-2 జాబిల్లిపై దిగుతున్న వేళ గగన్‌యాన్‌ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు ముమ్మరం చేసింది. 2022లో చేపట్టే గగన్​యాన్​ మిషన్​లో భాగంగా అంతరిక్షంలోకి పంపే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియలో మొదటి దశను ఇస్రో పూర్తి చేసింది.
భారత వాయుసేన ఆధ్వర్యంలోని 'ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్- బెంగళూరు'లో వ్యోమగాములుగా ఎంపికైన టెస్ట్​ పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించింది.

భారత వాయుసేన

"భారత వ్యోమగాముల ఎంపికలో మొదటి దశను ఐఏఎఫ్ పూర్తి చేసింది. ఎంపికైన టెస్ట్​ పైలట్లకు శారీరక వ్యాయామ, రేడియోలాజికల్, క్లినికల్, మానసిక దృఢత్వ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం."

-భారత వాయుసేన

మొదటి దశ ఎంపిక కోసం 25 టెస్ట్​ పైలట్లను పరీక్షించగా 2 లేదా 3 అభ్యర్థులకు వాయుసేన ఆమోదం తెలిపినట్లు సమాచారం.

మహిళలు అనుమానమే?

గగనయాన్‌కోసం పూర్తిగా టెస్ట్ పైలట్లే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి టెస్ట్​ పైలట్​ హోదాలో మహిళలు ఎవరూ లేరు. ఈ కారణంగా కొన్ని భారీ మార్పులు జరిగితే తప్ప మహిళా వ్యోమగాములు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

3 బృందాలు

మానవ సహిత యాత్ర కోసం తొలుత 30 మంది వ్యోమగాములను ఎంపిక చేసిన ఇస్రో చివరకు ముగ్గురితో కూడిన మూడు బృందాలు తయారు చేస్తారు. చివరకు ముగ్గుర్ని తొలి అంతరిక్ష యాత్రకు ఎంపిక చేయన్నారు.

ఇదీ చూడండి: భారత వ్యోమగాములకు రష్యా కంపెనీ శిక్షణ

Last Updated : Sep 29, 2019, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details