తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2019, 1:20 PM IST

Updated : Sep 29, 2019, 4:07 AM IST

ETV Bharat / bharat

ధనోవా సమక్షంలో అభినందన్​ యుద్ధ విన్యాసాలు!

పాక్​ వాయుసేనతో వీరోచితంగా పోరాడిన వింగ్​ కమాండర్ వర్ధమాన్ అభినందన్​ మరోసారి యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్ సైనికాధీనం నుంచి మార్చి 2న స్వదేశానికి తిరిగివచ్చిన వర్ధమాన్​.. శారీరక, మానసిక పరీక్షల తర్వాత నేడు తొలిసారి మిగ్​-21లో దూసుకెళ్లారు.

ధనోవా సమక్షంలో అభినందన్​ యుద్ధ విన్యాసాలు!

ధనోవా సమక్షంలో అభినందన్​ యుద్ధ విన్యాసాలు!

భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్... మరోసారి మిగ్​-21 విమానంలో యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్​ సేనకు చిక్కి, విడుదలైన అనేక నెలల తర్వాత తొలిసారిగా విమానాన్ని నడిపారు. పంజాబ్​ పఠాన్​కోట్​ వైమానిక స్థావరం నుంచి వాయుసేన అధినేత​ బీఎస్​ ధనోవాతో కలిసి ఆకాశ వీధుల్లోకి దూసుకెళ్లారు వర్ధమాన్.

అధీనం నుంచి వీర్​చక్ర దాకా...

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన(ఐఏఎఫ్).. పాక్​లోని జైషే మహ్మద్​ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఫిబ్రవరి 27న మనదేశ గగనతలంలోకి చొరబాటుకు యత్నించిన పాక్ విమానాలను తిప్పికొట్టింది ఐఏఎఫ్​. ఈ పోరాటంలో తాను నడుపుతున్న మిగ్-21 విమానం ప్రత్యర్థి భూభాగంలో కూలిపోయిన కారణంగా దాయాది సేనలకు చిక్కారు అభినందన్. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మార్చి 2న అభినందన్​ను భారత్​కు అప్పగించింది పాక్.

పాక్​ సైన్యం అధీనం నుంచి భారత్​ చేరుకున్న అభినందన్​కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో శారీరక, మాససిక పరీక్షలు నిర్వహించారు. ఐఏఎఫ్​ చీఫ్​ సమక్షంలో నేడు మిగ్​-21 విమానంతో మరోసారి గగనతలంలో దూసుకెళ్లారు అభినందన్​.

బాలాకోట్​ వైమానికి దాడుల్లో పాక్​ సైన్యంతో వీరోచితంగా పోరాడినందుకు.. యుద్ధ సమయాల్లో సైనికులను సత్కరించే మూడో అత్యున్నత అవార్డు.. వీర్​చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రం

Last Updated : Sep 29, 2019, 4:07 AM IST

ABOUT THE AUTHOR

...view details