రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారి వాజ్పేయీ నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్లో ఉగ్రవాదం అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"దేశ విభజన సమయంలో పాకిస్థాన్కు వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. పాకిస్థాన్లో పరిస్థితుల గురించి చదివినప్పుడు.. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వపడతా."