తెలంగాణ

telangana

'నా గుండెలు చీల్చి చూడండి.. మోదీ కనిపిస్తారు'

By

Published : Oct 16, 2020, 6:37 PM IST

జేడీయూ, భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ... ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్ మోదీ గురించి​ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీకి తాను గొప్ప విధేయుడనని పేర్కొన్నారు​.

LJP chief Chirag Paswan
చిరాగ్​ పాసవాన్​

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార జేడీయూ-భాజపా కూటమి నుంచి వైదొలిగిన లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​.. మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ బొమ్మను వాడనని చెప్పిన ఆయన.. తాను నరేంద్ర మోదీకి వీరభక్తుడిగా అభివర్ణించుకున్నారు.

" ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ప్రచారాలకు వాడుకోవాల్సిన అవసరం లేదు. మోదీ నా గుండెల్లో ఉన్నారు. నేను ఆయనకు హనుమంతుడిని. అవసరమైతే నా గుండెలు చీల్చి చూపిస్తాను"

-- చిరాగ్​ పాసవాన్​, లోక్​ జన్​శక్తి పార్టీ అధ్యక్షుడు

ఎన్డీఏలో నితీశ్​ నాయకత్వాన్ని అంగీకరించలేమంటూ ఇటీవలే కూటమి నుంచి వైదొలిగింది ఎల్​జేపీ. ఎన్నికల అనంతరం ఎల్​జేపీ ఎమ్మెల్యేలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు పాసవాన్​.

ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్

అభ్యర్థుల ప్రకటన..

అసెంబ్లీ ఎన్నికల రెండో విడత కోసం 26 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఎల్​జేపీ. మొత్తం 243 స్థానాలకు.. 143 స్థానాల్లో పోటీచేస్తోంది ఆ పార్టీ​. కేవలం జేడీయూ పోటీ చేస్తున్న స్థానాల్లోనే అభ్యర్థులను బరిలోకి దించుతోంది.

2015లో ఎల్​జేపీ 42 స్థానాల్లో పోటీ చేయగా రెండు చోట్ల విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details