తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాఫిక్ జరిమానాలపై త్వరలో దేశవ్యాప్త ఉద్యమం! - చలనా విధింపు

ట్రాఫిక్​ ఉల్లంఘనలపై కేంద్రం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టాయి ట్రాన్స్​పోర్ట్​ వాహన యాజమాన్యాలు. భారీ జరిమానాలు తగ్గించడంపై సెప్టెంబర్​ 19లోపు నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.

వాహన సంఘాల నిరసన

By

Published : Sep 16, 2019, 4:32 PM IST

Updated : Sep 30, 2019, 8:24 PM IST

వాహన యజమాన్యాల నిరసన

మోటారు వాహనాల నూతన చట్టంపై దిల్లీలోని ట్రాన్స్​పోర్ట్​ వాహన యాజమానులు నిరసన బాటపట్టారు. దిల్లీ జంతర్​మంతర్​ వద్ద వందలాది మంది ఆందోళన ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు.

"మోటారు వాహనాల చట్టం-2019ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రజలకు పెద్ద భారంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు జంతర్​మంతర్​ వద్ద నిరసన చేపడుతున్నాం. నితిన్​ గడ్కరీ, ప్రధాని నరేంద్రమోదీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి."

-వాహన యజమానుల సంఘం ప్రతినిధి

"ఈ రోజు ట్రాన్స్​పోర్టు సేవలందించే వాహన యాజమాన్య సంఘాలన్నీ ఇక్కడికి వచ్చాయి. ఈ చట్టంతో డ్రైవర్లపై అధిక భారం పడుతోంది. వాళ్ల జీతం పరిమితంగా ఉంటుంది. ఇంత జరిమానా వాళ్లు భరించలేరు. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోకపోతే సెప్టెంబర్​ 19న దేశవ్యాప్త బంద్​ చేస్తాం. ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం."

-వాహన యజమానుల సంఘం ప్రతినిధి

ఇదీ చూడండి: ఇదేంటి...? ఎద్దుల బండికి రూ.1000 చలానా..!

Last Updated : Sep 30, 2019, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details