తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 3:32 PM IST

ETV Bharat / bharat

'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'

దేశంలోని వివిధ మంత్రిత్వశాఖలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. లాక్​డౌన్​లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారని కొనియాడారు. కరోనాపై పోరులో మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Humanity will overcome pandemic, says PM as he hails ministries for helping people in lockdown
'మీ సహాయం భేష్​'- మంత్రిత్వశాఖలతో మోదీ

కరోనాపై పోరులో మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలు ఐకమత్యంతో కలిసి ముందుడుగేస్తున్నాయని తెలిపారు.

"ప్రపంచం ఐకమత్యంగా కరోనాపై పోరుడుతోంది. ఈ మహమ్మారిపై మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

స్విట్జర్లాండ్​లోని మాట్టర్​హార్న్​ పర్వతంపై 1000 మీటర్ల భారతీయ జెండాను ప్రదర్శించింది జెర్​మాట్​ అనే పర్యటక సంస్థ. ఆ ఫొటోను ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందిస్తూ ప్రధాని ఈ మేరకు ట్వీట్​ చేశారు.

స్విట్జర్లాండ్​లోని భారత రాయబరా కార్యాలం

'మీ సహాయం భేష్​...'

దేశంలోని వివిధ మంత్రిత్వశాఖలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. లాక్​డౌన్​లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని కొనియాడారు.

రైల్వేశాఖ, పెట్రోలియం శాఖ, పౌరవిమానయాన శాఖ, ఆదాయపు పన్ను శాఖతో పాటు మరిన్ని మంత్రిత్వశాఖలు.. ఈ లాక్​డౌన్​లో చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆయా ట్విట్టర్​ ఖాతాలో ట్వీట్స్​ చేశాయి. వీటన్నిటిపై స్పందించిన మోదీ.. ప్రజలకు ఎంతో గొప్పగా సహాయం చేస్తున్నాయని ప్రశంసించారు.

మోదీ జవాబు

ABOUT THE AUTHOR

...view details