తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన' - మమతా బెనర్జీ

జమ్ముకశ్మీర్​లో బలగాల మోహరింపుపై మరోమారు ధ్వజమెత్తారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కశ్మీర్​లో పూర్తిస్థాయిలో మానవ హక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. ప్రపంచ మానవతా దినం సందర్భంగా లోయలో శాంతి కోసం ప్రజలు ప్రార్థించాలని ట్వీట్​ చేశారు.

'కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన'

By

Published : Aug 19, 2019, 4:23 PM IST

Updated : Sep 27, 2019, 1:01 PM IST

జమ్ముకశ్మీర్​లో మానవ హక్కులకు పూర్తి స్థాయిలో భంగం కలిగిందని ఆరోపించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. బలగాల మోహరింపుపై తీవ్రంగా స్పందించారు. కశ్మీర్​ లోయలో శాంతి నెలకొనేందుకు ప్రార్థించాలని ప్రజలను కోరారు.

ప్రపంచ మానవతా దినం సందర్భంగా మానవ హక్కలపై తాను చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు దీదీ.

మమత ట్వీట్​

" ఈ రోజు ప్రపంచ మానవతా దినం. కశ్మీర్​లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. కశ్మీర్​లో మానవ హక్కులు, శాంతి కోసం ప్రార్థిద్దాం. మానవ హక్కుల అంశం నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. 1995లో లాకప్​ డెత్​లకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లఘనలపై 21 రోజులు రోడ్లపై నిరసన చేశాను."

- మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్​లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కశ్మీర్​లో ఆంక్షల విధింపును తప్పుపట్టారు మమత.

ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

Last Updated : Sep 27, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details