తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రూ.9 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం' - whitefield manipal hospital issue

మనిషి ప్రాణాలు పోయినా.. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయినా.. మాకు మాత్రం బిల్లు కట్టాల్సిందే అని పట్టుబట్టింది కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి. అక్షరాల రూ.9 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని మొండికేసింది. 28 గంటల పాటు బంధువులను హాస్పిటల్ బయటే నిలబెట్టింది. చివరకు రాష్ట్ర మంత్రి ఆగ్రహించి, ఆదేశించాక కాస్త వెనక్కి తగ్గింది.

Hospital Denayed to Handover the Dead Body Until they Pay the Bill of 9 Lakh Rupees in banglore
'రూ. 9 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం!'

By

Published : Jul 25, 2020, 1:07 PM IST

కర్ణాటక బెంగళూరులో రూ.9 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని మొండికేసింది ఓ ప్రైవేటు ఆసుపత్రి.

కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన అఫ్రోజ్ బీ అనే మహిళకు కరోనా సోకిందని తేలింది. శ్వాసకోశ సమస్యతో జులై 13న వైట్ ఫీల్డ్ లోని మనిపాల్ ఆసుపత్రిలో చేరింది. సరైన సమయానికి చికిత్స అందక మృతి చెందింది. అయితే, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలంటే పూర్తి బిల్లు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పారు ఆసుపత్రి సిబ్బంది.

'రూ. 9 లక్షల బిల్లు

బంధువులు అంత డబ్బు ఎలా కట్టగలమని, వైద్యులతో మాట్లాడినా లాభం లేకపోయింది. ఆఖరికి బృహత్ బెంగళూరు మహనగర పాలక సంస్థ అధికారులు ఆదేశించినా వినలేదు. దాదాపు 28 గంటలు ఆసుపత్రి బయటే నిలబడి మృత దేహం అప్పగించాలని ప్రాధేయపడ్డారు కుటుంబ సభ్యులు. అయినా కనికరించలేదు.

అయితే ఆ రాష్ట్ర మంత్రి బైరాతి బసవరాజు స్థానిక సర్కారు ఆసుపత్రిని పరిశీలించేందుకు వచ్చారు. ఆ సమయంలో అఫ్రోజ్ కుటుంబ సభ్యులు మంత్రికి పరిస్థితి వివరించారు. దీంతో మంత్రి ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. అఫ్రోజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది.

ఇదీ చదవండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్​ వేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details