తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సైన్యం వెంట యావత్​ దేశం ఉందనే సందేశం ఇవ్వాలి'

సరిహద్దుల్లో పోరాడుతోన్న సైనికుల వెంట దేశం మొత్తం ఉందనే సందేశాన్ని ఈ పార్లమెంటు సమావేశాలు ఇస్తాయని నమ్మకం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని, అనేక కీలకాంశాలు, బిల్లులపై సమగ్ర చర్చ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

By

Published : Sep 14, 2020, 10:38 AM IST

Updated : Sep 14, 2020, 4:57 PM IST

PM modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల వెంట యావత్‌ భారతావని ఉందనే సందేశాన్ని ఈ పార్లమెంటు సమావేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా పాయింట్​లో మాట్లాడారు ప్రధాని మోదీ. వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో అనేక కీలకాంశాలు, బిల్లులపై సమగ్ర చర్చ జరుగుతుందని.. ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ సమావేశాల్లో పార్లమెంటుకు మరో గురుతర బాధ్యత ఉంది. మన వీర సైనికులు సరిహద్దుల్లో, ఎంతో ఎత్తైన పర్వతాలపై దేశ రక్షణ కోసం నిలబడి ఉన్నారు. కొద్ది రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మాతృభూమి కోసం వారు దృఢ సంకల్పంతో పోరాడుతున్నారు. వారికి... పార్లమెంటు, పార్లమెంటు సభ్యులంతా ముక్తకంఠంతో, ఒకే భావన, ఒకే సంకల్పంతో సైనికుల వెంట ఈ దేశం ఉందని చాటిచెబుతారని విశ్వసిస్తున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈసారి శని, ఆదివారాల్లోనూ సభ సమావేశమవుతుందన్నారు ప్రధాని. వ్యాక్సిన్‌ వచ్చేవరకూ అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అనేక జాగ్రత్తల మధ్య ఈ సారి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నట్లు గుర్తుచేసిన ప్రధాని మొదటిసారిగా లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో కొలువుదీరుతోందని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రముఖుల మృతికి లోక్​సభ సంతాపం

Last Updated : Sep 14, 2020, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details