కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) నిర్వహిస్తున్న 'మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్'లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొననున్నారు. ఈ మేరకు ఉదయం 9:30 గంటలకు కదర్పుర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అధికారుల శిక్షణా అకాడమీని షా సందర్శిస్తారు.
ఈ నెలలో 1.35 కోట్లకు పైగా మొక్కలను నాటడమే లక్ష్యంగా సీఏపీఎఫ్ విభాగాలన్నీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. సీఏపీఎఫ్కు చెందిన 5 శాఖల అధిపతులు సహా ఇతర కేంద్ర దళాల ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు షా.