తెలంగాణ

telangana

కర్ణాటకలో 'పౌర' జ్వాల: చరిత్రకారుడు గుహ అరెస్టు

By

Published : Dec 19, 2019, 3:12 PM IST

Updated : Dec 19, 2019, 6:32 PM IST

పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలతో కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరు టౌన్​హాల్ వద్ద నిరసన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర పార్టీల నేతలనూ నిర్భంధించారు.

karnataka
కర్ణాటకలో 'పౌర' జ్వాల: చరిత్రకారుడు గుహ అరెస్టు

కర్ణాటకలో 'పౌర' జ్వాల: చరిత్రకారుడు గుహ అరెస్టు

దేశంలోని ప్రధాన నగరాలు పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్నాయి. కర్ణాటక బెంగళూరులోని టౌన్​హాల్​లో ఆందోళన నిర్వహించిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్​ అర్షద్​ను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ఇతర పార్టీ నేతలనూ నిర్బంధించారు. తన అరెస్టు అప్రజాస్వామికమని గుహ అన్నారు. శాంతియుత నిరసనలకూ పోలీసులు అనుమతించడం లేదని చెప్పారు.

రామచంద్ర గుహ అరెస్టుపై దుమారం చెలరేగుతోంది. పోలీసుల చర్యలపై బయోకాన్​​ ఎండీ కిరణ్​ మజుందర్ షా​ షాక్​కు గురయ్యారు. శాంతియుత నిరసనలు చేపట్టడం ప్రాథమిక హక్కు అని.. పోలీసులు ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గుహ అరెస్టుపై మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​హసన్​ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నించే గొంతులను మూయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి భద్రతపై ఆందోళనగా ఉందన్నారు. చరిత్రకారులను ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు తృణమూల్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

పౌర చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​ విధించారు అధికారులు. ఈ చట్టాన్ని నూటికి నూరు శాతం కర్ణాటకలో అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: దిల్లీ మళ్లీ హింసాత్మకం- నేతలు, విద్యార్థులు అరెస్ట్​

Last Updated : Dec 19, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details