తెలంగాణ

telangana

'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

By

Published : Dec 28, 2019, 10:35 PM IST

పౌరచట్టం, ఎన్​ఆర్​సీలపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై మండిపడ్డారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మక్తార్​ అబ్బాస్​ నఖ్వీ. 'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదలతో కప్పుతున్నారు' అని ఎద్దేవా చేశారు.

Hiding mountain of truth with bushes of lies: Naqvi on anti-   CAA protests
'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

దేశ వ్యాప్తంగా పౌరచట్టం, జాతీయ పౌర జాబితాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ వారిపై మండిపడ్డారు. 'అబద్ధాల పొదతో నిజమనే కొండ'ను దాచటానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"భారత్​లో ముస్లిం సోదరులను ఎవరూ బలవంతంగా ఉంచటం లేదు. దేశం మీద ఇష్టం, ప్రేమతోనే వారు ఇక్కడ జీవిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏ, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల పొదతో నిజమనే పర్వతాన్ని దాచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలోని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివక్షలకు తావు లేకుండా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తోంది."
-ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి.

మైనారిటీలకు పాకిస్థాన్​ నరక కూపమైతే భారత్​ స్వర్గధామమని నఖ్వీ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించలేని కొన్ని శక్తులు దేశాన్ని బలహీన పరచటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఆందోళనలను చేస్తోన్న వారిని 'అలా అయితే పాకిస్థాన్​ వెళ్లిపోండి' అని పోలీస్ అధికారి అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. నిజంగా పోలీసు వారిని పాకిస్థాన్ వెళ్లమని అంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.

ఇదీ చూడండి:పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details