తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2020, 3:27 PM IST

Updated : Sep 30, 2020, 10:35 PM IST

ETV Bharat / bharat

లారీ ఆపి మరీ చెరుకు తిన్న ఏనుగుల గుంపు

కర్ణాటక-తమిళనాడు సరిహద్దు వద్ద అసనూర్​లో ఓ ఏనుగుల గుంపు లారీని అడ్డగించి అందులోని చెరుకును ఆరగించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను లారీ డైవర్​ తన చరవాణిలో బంధించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Herd of Elephant  stopped the lorry and ate canes in Chamarajnagar
లారీ ఆపి చెరుకు తిన్న ఏనుగుల గుంపు

ఓ ఏనుగుల గుంపు రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఆపేశాయి. అందులోని చెరుకు గడలను ఎంచక్కా తినేశాయి. ఈ ఘటన కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అసనూర్‌ ప్రాంతంలో జరిగింది. సంబంధిత దృశ్యాలను ఆ లారీ డ్రైవర్ తన చరవాణిలో బంధించాడు.

లారీ ఆపి చెరుకు గడలను తింటోన్న ఏనుగులు

గజరాజులు చెరుకు తింటోంటే అడ్డగించకుండా వాహనంలోనే ఉండిపోయాడు డ్రైవర్. ఫలితంగా.. బెంగళూరు-దిండిగల్​ జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. కొంత చెరుకు తిన్న తర్వాత ఆ ఏనుగుల సమూహం అక్కడి నుంచి వెనుదిరిగింది.

లారీ ఆపిన ఏనుగుల గుంపు

ఇదీ చూడండి:భార్యను వేధిస్తున్న డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

Last Updated : Sep 30, 2020, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details