తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోతులకు ప్రత్యేక సఫారీ ఏర్పాటు చేయాలి' - పార్లమెంటులో హేమమాాలిని

కోతులు ఫ్రూటీ, సమోసా, కచోరీలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భాజపా ఎంపీ హేమమాలిని అన్నారు. పార్లమెంటులో గురువారం హేమమాలిని మాట్లాడుతూ.. తక్షణమే కోతులకు ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటు చేయాలని కోరారు.

హేమమాలిని, భాజపా ఎంపీ

By

Published : Nov 21, 2019, 9:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మథురలో కోతుల బెడద తీవ్రంగా ఉందని భాజపా ఎంపీ, సినీ నటి హేమమాలిని పేర్కొన్నారు. తీర్థ స్థలమైన బృందావన్​లో కోతులకు ఫ్రూటీ, సమోసా, కచోరీలను యాత్రికులు అలవాటు చేస్తున్నారని.. ఫలితంగా అవి అనారోగ్యం పాలవుతున్నాయని తెలిపారు.

కోతులకు ప్రత్యేక సఫారీ ఏర్పాటు చేసి అక్కడి స్థానికులతో పాటు కోతుల సమస్యను తీర్చాలని పార్లమెంటు వేదికగా అటవీ శాఖను కోరారు హేమమాలిని. అయితే ఈ విషయాన్ని నవ్వులాటగా కాకుండా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

హేమమాలిని, భాజపా ఎంపీ

"నా నియోజకవర్గం మథుర.. బృందావన్​, గోవర్ధన్​ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. అక్కడికి వచ్చే యాత్రికులు కోతులకు ఫ్రూటీ, కచోరీ, సమోసాలను తినిపిస్తున్నారు. ఈ కారణంగా అవి అనారోగ్యం పాలవుతున్నాయి. వాటి నుంచి మిగతా వాటికి, మనుషులకూ ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వీటి సంఖ్యను తగ్గించేందుకు వైద్యులు స్టెరిలైజ్ చేశారు. దీనివల్ల అవి హింసాత్మకంగా మారాయి. ఆహారం కోసం దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో మనుషులు మరణించిన సంఘటనలూ బృందావన్​లో జరిగాయి. ఈ భూమి మీద మనలాగే వాటికి జీవించే హక్కు ఉంది. కోతుల కోసం ప్రత్యేక సఫారీని ఏర్పాటు చేయాలని అటవీశాఖను కోరుతున్నా."

-హేమమాలిని, భాజపా ఎంపీ

తృణమూల్ ఎంపీ మద్దతు..

హేమమాలిని డిమాండ్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ కూడా మద్దతు తెలిపారు. మథురలో దర్శనానికి వెళ్లిన తనకు కూడా కోతుల బెడద ఎదురైందని చెప్పారు. కోతులు తన కళ్లద్దాలు ఎత్తుకెళ్లాయని.. చివరికి ఫ్రూటీ ఇచ్చి వాటిని విడిపించుకున్నానని తన అనుభవాన్ని తెలిపారు.

ఇదీ చూడండి:పార్లమెంటును తాకనున్న బ్యాంకుల విలీన వ్యతిరేక సెగ

ABOUT THE AUTHOR

...view details