తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​పై మంచు దుప్పటి.. స్తంభించిన జనజీవనం - మంచు కష్టాలు హిమాచల్​ ప్రదే్శం

హిమచల్​ప్రదేశ్​లో సోమవారం నుంచి భారీగా మంచు కురుస్తోంది. రహదారులపై మంచు దుప్పటి పరుచుకున్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కిన్నౌర్​, కుల్లూ, మనాలీలో జాతీయ రహదారి సహా 12కు పైగా రోడ్డు మార్గాలను మూసివేశారు అధికారులు.

snowfall
హిమాచల్​ను కప్పేస్తున్న మంచు.. స్తంభించిన జనజీవనం

By

Published : Jan 7, 2020, 12:31 PM IST

Updated : Jan 7, 2020, 3:02 PM IST

హిమాచల్​పై మంచు దుప్పటి.. స్తంభించిన జనజీవనం

దేవభూమి హిమాచల్​ ప్రదేశ్​లోని పర్యటక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కిన్నౌర్​, కుల్లూ, మనాలీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ఆ ప్రాంతమంతా అడుగుల మేర మంచు దుప్పటి పరుచుకోవటం వల్ల జనజీవనం స్తంభించింది.

హిమాచల్​లో హిమపాత ప్రభావిత ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారి సహా 12కు పైగా ప్రధాన రహదారులను మూసివేశారు అధికారులు. కొన్ని బస్సులను దారి మళ్లించగా.. మరికొన్నింటిని రద్దు చేసింది హిమాచల్​ ఆర్​టీసీ. చిత్కుల్, నాకొ, హాంగొ, చులింగ్​, సంగ్లా ప్రాంతాల్లో మొబైల్​ సేవలు నిలిచిపోయాయి.

కుల్లూ మనాలీలో హై అలర్ట్​

కుల్లూ మనాలీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమైన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఎత్తైన ప్రాంతాలకు సందర్శించటానికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ పరిస్థితి జనవరి 9వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి : 'మరింత దృఢంగా భారత్​-అమెరికా స్నేహబంధం'

Last Updated : Jan 7, 2020, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details