తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ విలవిల- 17మంది మృతి - భారీ వర్షాలు

ఉత్తరాది రాష్ట్రం ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అకాల వర్షాలకు ఉత్తరకాశీ జిల్లాలో 17మంది మరణించారు. మరో 20మంది గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చార్​ధామ్​ యాత్ర నిలిచిపోయింది. యాత్రికులకు వసతిని ఏర్పాటు చేశారు అధికారులు.

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ విలవిల

By

Published : Aug 19, 2019, 12:35 PM IST

Updated : Sep 27, 2019, 12:22 PM IST

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ విలవిల

ఉత్తరాఖండ్​పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రవాణా వ్యవస్థ దెబ్బతింది. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

దయనీయంగా ఉత్తరకాశీ..

అకాల వర్షాలకు ఉత్తరకాశీ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక నివాసాలు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. సోమవారమూ అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి.

సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. విమానాల సహాయంతో క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నిలిచిన చార్​ధామ్​ యాత్ర...

వరుణుడి ప్రతాపానికి చార్​ధామ్​ యాత్ర నిలిచిపోయింది. సుమారు 800 మంది యాత్రికులు బద్రినాథ్​లోనే ఉండిపోయారు. వారికి వసతిని ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి:- ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

Last Updated : Sep 27, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details