హిమాచల్ ప్రదేశ్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది మృతి చెందారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానలకు వివిధ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడటం, వరదలు ముంచెత్తటం వల్ల 500 మంది రోడ్ల మీదే నిలిచిపోయారు. జాతీయ విపత్తు దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.
వరదలు ముంచెత్తినందున త్రిండి, దన్ని, లాడోర్, థనా, హిండోర్ఘాట్, జాసుర్ ప్రాంత ప్రజలు నివాస స్థలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాలకు కాగ్రా జిల్లాలోని మంచి నీటి పైపు లైనులు విరిగిపోయాయి. పైపు లైన్లను పునరుద్ధరించటానికి రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.