తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్య విద్యార్థులకు కేంద్రం తీపికబురు

వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష-'నీట్-పీజీ​'ని తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎమ్​డీ, ఎమ్​ఎస్ ప్రవేశానికి ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష సరిపోతుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎమ్​సీ) ముసాయిదా బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురానుంది.

By

Published : Jul 14, 2019, 11:08 PM IST

పీజీ చేయాలనుకునే వైద్య విద్యార్థులకు శుభవార్త

పీజీ చదవాలనుకునే వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష 'నీట్​-పీజీ'ని తొలగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదన చేసింది. ఎమ్​డీ, ఎమ్​ఎస్​ ప్రవేశానికి ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎమ్​సీ) ముసాయిదా బిల్లుకు సవరణలు చేసింది. ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్​ ముందుకు తీసుకురానుంది ఆరోగ్య శాఖ. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు బిల్లులో సవరణలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నూతన ఎన్​ఎమ్​సీ బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం వైద్య విద్య పీజీలో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్​ ఎక్జిట్​ టెస్ట్​ (నెక్ట్స్​) పరీక్ష ఫలితాలు సరిపోతాయి. ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష రాసిన అనంతరం పీజీలో చేరేందుకు ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. ఎమ్​బీబీఎస్​ అనంతరం ప్రాక్టీస్​కు సైతం ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరమూ లేదు.

ఎయిమ్స్​లో తప్పనిసరి

ఎయిమ్స్​లో పీజీ చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పరీక్ష తప్పని సరి. డీఎమ్​, ఎమ్​సీహెచ్​ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష 'నీట్​-సూపర్​స్పెషాలిటీ' రాయాల్సిందే.

ప్రతి ఏటా 1.5 లక్షల మంది..

దేశంలోని 480 వైద్య కళాశాలల్లో ఎమ్​బీబీఎస్​ కోర్సుల్లో ప్రతి ఏటా 80 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. 50 వేల పీజీ సీట్ల కోసం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు నీట్-పీజీ పరీక్ష రాస్తున్నారు.

2017లోనే లోక్​సభ ముందుకు బిల్లు

ఎన్​ఎమ్​సీ బిల్లును 2017, డిసెంబర్​లో లోక్​సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. కానీ 16వ లోక్​సభ రద్దుతో ఆ బిల్లు గడువు ముగిసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వాణి

ABOUT THE AUTHOR

...view details