తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్ష నేతల కేసులన్నింటికీ ఒక్కరే న్యాయమూర్తి!

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కుంభకోణంలో చిదంబరానికి సంబంధించిన అన్ని కేసులను ఇప్పటి వరకు ప్రత్యేక న్యాయమూర్తి సైనీ విచారించారు. ఆయన పదవీ కాలం ముగుస్తుండటం వల్ల ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​కు ఈ కేసులను బదిలీ చేసింది దిల్లీ హైకోర్టు. అక్టోబర్​ 1 నుంచి ఈ కేసుల విచారణ బాధ్యతలను చేపట్టనున్నారు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​.

By

Published : Sep 17, 2019, 6:00 PM IST

Updated : Sep 30, 2019, 11:19 PM IST

చిదంబరం కేసుల్లో ప్రత్యేక న్యాయమూర్తి బదిలీ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సంబంధించిన ఎయిర్​సెల్​ మ్యాక్సిస్ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​​ కుహార్​కు బదిలీ చేస్తూ దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ విచారించారు. ఈ నెలాఖరులో సైనీ పదవీకాలం ముగుస్తుండటం వల్ల దిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే కాంగ్రేస్​ నేత​ డీకే శివకుమార్​, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​​, అయన కుటుంబ కేసులు, హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, అయన కుటుంబానికి సంబంధించిన కేసులు, ఇతర కేసులను కుహార్​ విచారిస్తున్నారు. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​ అక్టోబర్​ 1 నుంచి ఈ ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులను పరిశీలిస్తారు.

2జీ కుంభకోణం కేసులో రోజువారీ విచారణ కోసం సుప్రీంకోర్టు గతంలో జస్టిస్​ సైనీని నియమించింది. కేసుకు సంబందించిన నిందితులందరినీ 2017 డిసెంబర్​లో నిర్దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం.

కొన్ని రోజుల ముందు ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో చిదంబరం, అయన కుమారుడికి ముందస్తు బెయిల్​ మంజూరు చేశారు జస్టిస్​ సైనీ.

ఇదీ చూడండి:-ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత

Last Updated : Sep 30, 2019, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details