తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి: చెట్ల నరికివేతపై మరో పిటిషన్​ కొట్టివేత..! - అరే ప్రాంతంలో చెట్లు నరికివేత నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన బొంబాయి హైకోర్టు

ముంబయి ఆరే ప్రాంతంలో మెట్రో కారుషెడ్డు నిర్మించేందుకు 2600 వృక్షాలు తొలగిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్లను మరోసారి బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చెట్లు నరికివేసేందుకు ముంబయి మెట్రో సన్నాహాలు ప్రారంభించింది.

'చెట్లేగా.. నరికిపారేసి.. కారు షెడ్డు నిర్మించండి'

By

Published : Oct 5, 2019, 5:54 PM IST

Updated : Oct 5, 2019, 7:22 PM IST

ముంబయి: చెట్ల నరికివేతపై మరో పిటిషన్​ కొట్టివేత..!

పర్యావరణవేత్తలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతంలో కార్ షెడ్డు నిర్మించకుండా నిలువరించాలని వేసిన మరో పిటిషన్​నూ బొంబాయి హైకోర్టు తాజాగా కొట్టివేసింది.

ఇంతకు ముందు..

ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతం​లో కారు షెడ్డును నిర్మించాలనుకుంది. అందుకోసం అక్కడున్న దాదాపు 2,600 చెట్లను తొలగించాలనుకుంది. పలు ఎన్​జీఓలు, పర్యావరణవేత్తలు దీనిని అడ్డుకున్నారు. ఇందుకోసం మెట్రోకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం మెట్రోకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే చెట్ల నరికివేతను ముంబయి మెట్రో (ఎమ్​ఎమ్​ఆర్​సీఎల్​) ప్రారంభించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పర్యావరణవేత్తలు.. తీర్పు నిలుపుదల చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్​సీ ధర్మాధికారి, ఏకే మీనన్​ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. చివరికి ముంబయి మెట్రోకే అనుకూలంగా తీర్పునిచ్చింది.

పూర్తి వివరాల కోసం:ముంబయి: 2,600 వృక్షాల రక్షణకై ఆందోళనలు

కొత్తగా నోటీసులా.. అవసరంలేదు..

హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యంలో ముంబయి మెట్రో చెట్ల నరికివేతకు సన్నద్ధమైంది. అయితే ఇందుకోసం మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. మరోవైపు పర్యావరణవేత్తల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి:బ్యాంకులకు వరుస సెలవులు.. ఇప్పుడే చూసుకోండి..!

Last Updated : Oct 5, 2019, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details