తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని ఆదేశం!

ఓ ఆదాయపు పన్ను కేసులో ఐఏఎస్​ అధికారిని 100 మొక్కలు నాటాలని ఆదేశించింది కేరళ హైకోర్టు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : Feb 14, 2020, 11:24 PM IST

Updated : Mar 1, 2020, 9:16 AM IST

HC orders bureaucrat to plant saplings for delayed action
కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని జరిమానా!

కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి 'కె బిజు'కు ఊహించని శిక్ష విధించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆదాయపు పన్నుకు సంబంధించి ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం.. బిజు 100 మొక్కలు నాటాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆదాయపన్నులో రసాయన పరిశ్రమకు మినహాయింపునిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ఆలస్యం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఆయన ఏఏ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్న విషయాన్ని అటవీ అధికారులకు అప్పగించింది. అనంతరం మొక్కలు నాటిన జాబితాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

Last Updated : Mar 1, 2020, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details