అందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్ ఉద్ఘాటించారు. డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ లక్ష్యంగా 'జాతీయ డిజిటల్ ఆరోగ్య ముసాయిదా'ను విడుదల చేశారు. దీని ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు అందించేందుకు సంకల్పించారు. ఈ డిజిటల్ వ్యవస్థలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ డిజిటల్ ఆరోగ్య ప్రణాళికపై వివిధ రంగాల వ్యక్తులు, సంస్థల నుంచి సూచనలను ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు కేంద్రమంత్రి. సూచనలను డబ్ల్యూ. డబ్ల్యూ. డబ్ల్యూ. ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ. జీఓవీ. ఇన్ ద్వారా మూడు వారాల్లోగా పంపించాలని సూచించారు. అందరికీ ఆరోగ్యం అందించటంలో అవసరమయ్యే ప్రతి అంశం భారత్లో ఉందని ఉద్ఘాటించారు.