తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2019, 11:36 PM IST

Updated : Oct 16, 2019, 7:02 AM IST

ETV Bharat / bharat

'కఠినంగా వ్యవహరిస్తే.. కశ్మీర్​లో శాంతి అసాధ్యం'

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి, కుమార్తెను అరెస్ట్​ చేయడంపై  నేషనల్​ కాన్పరెన్స్​ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇలానే కఠినంగా వ్యవహరిస్తే... కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు చూడటానికి మరింత ఆలస్యమవుతుందని హెచ్చరించింది.

ఫరూక్ అబ్దుల్లా సోదరి, కుమార్తె అరెస్టుపై భగ్గుమన్న ఎన్​సి

కశ్మీర్​లోని శ్రీనగర్​లో నిరసనలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా సోదరి, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నేషనల్​ కాన్పరెన్స్​ పార్టీ ఖండించింది. ఇటువంటి కఠిన చర్యలు ప్రభుత్వం నుంచి ప్రజలను మరింత దూరం చేస్తాయని తెలిపింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వ చర్యలు విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది.

నిర్భంధంలో ఉన్న నాయకులను, సామాన్య ప్రజలను, ఫరూక్​ అబ్దుల్లా బంధువులను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ చర్యల వలన కశ్మీరీల్లో భయం, అభద్రతా భావం మరింత పెరుగుతాయన్నారు. కశ్మీర్​లో స్వేచ్ఛకు పెను ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్బంధంలో ఉంచిన రాజకీయనేతలను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ ఫరూక్​ అబ్దుల్లా కుమార్తె నేతృత్వంలో కొందరు మహిళలు శ్రీనగర్​లో నిరసన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు అబ్దుల్లా సోదరి, కూమార్తె సహా మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి : నోట్లరద్దు, జీఎస్టీ కారణంగానే నిరుద్యోగం: రాహుల్

Last Updated : Oct 16, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details