తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రకృతి అందాల కోసం అరుణాచల్​ప్రదేశ్​కు వెళ్లాల్సిందే! - River Yamne

ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అరుణాచల్​ప్రదేశ్​ మంచి వేదికగా నిలుస్తుంది. ఇక్కడ సహజ సిద్ధమైన అందాలతో పాటు వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు ఉన్నాయి. అలాగే దేశంలోనే 300 మీటర్ల పొడవైన సింగిల్-లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ కూడా ఇక్కడ ఉంది.

Hanging bridge: Major source of connectivity for people of Arunachal
ప్రకృతి అందాల కోసం అరుణాచల్​ప్రదేశ్​కు వెళ్లాల్సిందే!

By

Published : Aug 20, 2020, 8:05 AM IST

దేశంలోని అందమైన ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, మేఘాలయ​తో పాటు అరుణాచల్​ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి ఈ రాష్ట్రం మంచి ఎంపిక. ప్రపంచానికి తెలియని ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం రండి...

ప్రకృతి అందాల కోసం అరుణాచల్​ప్రదేశ్​కు వెళ్లాల్సిందే!

దేశంలోనే 300 మీటర్ల పొడవైన సింగిల్-లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఇక్కడ ఉంది. ఈ వంతెన ప్రధాన పర్యటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.

యమునా నది మీద వెదురు బొంగులతో నిర్మించిన మరొక వంతెన కూడా ఇక్కడికి వచ్చే పర్యటకుల మనసు దోచేస్తోంది. దీనిని కర్రలు, తాళ్లతో రూపొందించారు. మనుషులు నడవటం కోసం నడిభాగంలో వెదురు బొంగుల అమరికను పేర్చారు. ఈ వంతెనను గిరిజనుల సంస్కృతికి చిహ్నంగా అభివర్ణిస్తారు.

దాదాపు 1000 అడుగుల పొడవుగల ఈ వంతెనను.. గిరిపుత్రులు వారి రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుంటారు.

ఆ దృశ్యాలు కనువిందు..

దీనిపై నుంచి వెళ్లేటప్పుడు నది ప్రవాహాన్ని చూస్తే అందులోని రకరకాల చేపలు పైకి, కిందకి ఎగురుతున్న సుందరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. నదీ పరివాహాక ప్రాంతంలో ఉన్న దాదాపు 20వేల మందికి ఇది ఎంతో ఉపయోగపడటమే కాకుండా, రక్షణను కల్పిస్తుంది.

ఈ రెండు వంతెనలు ఇక్కడి ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా అటవీ వృక్షాలు, పండ్లు, ఇతర వాటిపై ఆధారపడి జీవిస్తుంటారు.

ఇదీ చూడండిపోలీసుల వేషంలో ఇంటికి వచ్చి ఘరానా దోపిడీ

ABOUT THE AUTHOR

...view details