తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 7:49 AM IST

ETV Bharat / bharat

రోగనిరోధకశక్తిని పెంచే ఔషధాలపై 'హామ్​దర్ద్​'​ ట్రయల్స్​

దిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేసే ప్రముఖ ఆరోగ్య సంస్థ హామ్​దర్ద్​ ల్యాబొరేటరీస్​ త్వరలోనే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలపై క్లినికల్​ ట్రయల్స్​​ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరీక్షలకు కావాల్సిన అనుమతుల కోసం సంబంధిత అధికారులకు ప్రతిపాదన పంపినట్లు హామ్​దర్ద్​ తెలిపింది.

Hamdard Labs to conduct clinical trials
హామ్​దర్ద్​ ప్రయోగశాలలో త్వరలోనే క్లినికల్​ ట్రయల్స్​!

మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలపై క్లినికల్​ ట్రయల్స్​​ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది ప్రముఖ ఆరోగ్య సంస్థ హామ్​దర్ద్​ ల్యాబొరేటరీస్​. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం సంబంధిత అధికారిక వర్గాలకు తమ ప్రతిపాదనను పంపినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దిల్లీలోని 'హామ్​దర్ద్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసెర్చ్​'లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

హామ్​దర్ద్​ సంస్థ ప్రతిపాదనను ఆయుష్​ శాఖ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది పరిశీలించిన అనంతరం.. క్లినికల్ ట్రయల్స్​ అనుమతిపై ఐసీఎంఆర్​ తుది నిర్ణయం తీసుకోనుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేలా పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ముందడుగేయాలన్న ఆయుష్​ మంత్రిత్వశాఖ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హామ్​దర్ద్​ ల్యాబొరేటరీస్​ ఛైర్మన్​ అబ్దుల్​ మజీద్​ తెలిపారు.

'ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు బలమైన రోగనిరోధక శక్తే కీలకం. మా​ ఔషధాలు సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచేలా అభివృద్ధి చేశాం. ఇవి నిర్ధిష్ట ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడం ద్వారా కొవిడ్​-19 ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడతాయి.'

- అబ్దుల్​ మజీద్, హామ్​దర్ద్​​ ల్యాబొరేటరీస్​ ఛైర్మన్

మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ సంస్థ నిర్వహించే ట్రయల్స్​ సానుకూల ఫలితాలను ఇస్తాయని హామ్​దర్ద్​ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:'మరణాల రేటు అత్యల్పం- రికవరీ రేటు గణనీయం'

ABOUT THE AUTHOR

...view details