రాజ్యసభ ఎన్నికల వేళ..గుజరాత్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్షయ్ పటేల్, జీతు చౌదరీ తమ రాజీనామా లేఖలను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి సమర్పించగా వాటిని ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగినట్లైంది.
గుజరాత్లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా...వీటిలో రెండింటిని గెలుచుకోవాలని భావించిన కాంగ్రెస్కు ఇది ఎదురుదెబ్బగా మారింది.